జమ్మికుంటలో ఘనంగా కానిస్టేబుల్ కిష్టయ్య వర్ధంతి వేడుకలు

byసూర్య | Thu, Dec 01, 2022, 02:18 PM

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్య 13వ వర్ధంతి వేడుకలను గురువారం జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు అధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిష్టయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ నాడు అమరుల త్యాగం నేటి తెలంగాణ అని అమరుల త్యాగాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేడీసీసి వైస్ చైర్మన్ పింగళి రమేష్, వైస్ చైర్ పర్సన్ దేశీని స్వప్న కోటి, స్థానిక కౌన్సిలర్ కుతాడి రాజయ్య, కౌన్సిలర్లు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బోళ్ళ సుధాకర్, ఉమ్మడి జమ్మికుంట మండల ముదిరాజ్ సర్పంచులు, ఎంపీటీసీలు, ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM