byసూర్య | Thu, Dec 01, 2022, 02:12 PM
వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలో 35 మంది బీజేపీ కార్యకర్తలు గురువారం టీఆరెస్ పార్టీలో చేరారు. అలాగే కనిమెట్ట గ్రామానికి చెందిన గ్రామ శ్రీ కాళికదేవి సంఘం నుంచి 40 మంది, కనిమెట్ట ట్రాక్టర్స్ డ్రైవర్ సంఘం నుంచి 45 మంది, హమాలి సంఘం నుంచి 25 మంది, వివిధ పార్టీలకు చెందిన 15 మంది కార్యకర్తలు దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో టీఆరెస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే టీఆరెస్ పార్టీ లోకి ఆహ్వానించారు. అభివృద్ధికి ఆకర్షితులై ఆ యా పార్టీల నాయకులు టీఆర్ఎస్లోకి వస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు అన్నారు. కొత్త, పాత తేడా లేకుండా అందరూ కలుపుకొని పోవాలన్నారు.