byసూర్య | Thu, Dec 01, 2022, 02:13 PM
తెలంగాణ కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టీ అమరుడు అయిన తెలంగాణ ముదిరాజ్ ముద్దు బిడ్డ కానిస్టేబుల్ కిష్టయ్య వర్ధంతి నేడు.. బాన్సువాడ పట్టణ కేంద్రంలో కిష్టయ్య చౌక్ వద్ద కిష్టయ్య విగ్రహానికి పుల మాల వేసి తెరాస పార్టీ ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం సంయుక్తంగా కానిస్టేబుల్ కిష్టయ్యకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ అని నాయకులు గుర్తు చేసుకొని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు బంధు జిల్లా అధ్యక్షులు దుద్దాల అంజి రెడ్డి , మున్సిపల్ చైర్మెన్ శ్రీ జంగం గంగాధర్, బాన్సువాడ సహకార సంఘం అధ్యక్షులు కృష్ణ రెడ్డి, కొర్ల పోతూ రెడ్డి , ముదిరాజ్ సంఘం నాయకులు గాదు మల లింగం కౌన్సిలర్ లు పాశం రవీందర్ రెడ్డి, మోతీ లాల్ సోషల్ మీడియా పట్టణ కన్వీనర్ సయ్యద్ ఇలియాస్ అలి, ముదిరాజ్ సంఘం నాయకులు, తెరాస నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.