byసూర్య | Thu, Dec 01, 2022, 01:30 PM
గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని మాజీ మంత్రి బాబూమోహన్ అన్నారు. బుధవారం ప్రజాగోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా రెగోడ మండలంలోని గజవాడ, టిలింగంపల్లి, సింధోల్, పోచారం, మర్పల్లి, రేగోడు, కొండాపూర్, జగిర్యాల, అర్ఇటిక్యాల గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాబూమోహన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగడం లేదన్నారు. సింధోల్ రోడ్డు అద్వానంగా ఉన్నా పాలకులు పట్టించుకోవడంలేదని విమర్శించారు.