byసూర్య | Thu, Dec 01, 2022, 01:25 PM
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ బుధవారం జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం కాకి జన్వాడ గ్రామంలో నిర్వహించిన శ్రీ జొన్నాడ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాల్లో ఎమ్మెల్యే మాణిక్ రావుతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కురుమ సంఘం సభ్యులు స్థానికులు పాల్గొన్నారు.