షర్మిల సంచలన వ్యాఖ్యలు
byసూర్య |
Thu, Dec 01, 2022, 01:39 PM
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసై ని కలిశారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ 'కొన్ని రోజులుగా నా పాదయాత్రను టీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది. నా పాదయాత్రను అడ్డుకోవడం, దాడి ఘటనలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశా. కవిత, కేటీఆర్ ఇళ్లపై దాడులు చేయాలి. పాదయాత్ర చేస్తే దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు. కవిత పేరు లిక్కర్ స్కాంలో ఉంది. ప్రగతి భవన్ లో దాడులు చేస్తే వేల కోట్లు దొరుకుతాయి. మీ అవినీతిని ప్రశ్నిస్తే రెచ్చగొట్టడం అవుతుందా? టీఆర్ఎస్ నేతలు వందల కోట్లు ఎలా సంపాదించారు? కేసీఆర్ ఫ్యామిలీకి వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఆడపిల్ల పుట్టగానే ఆడ.. పిల్ల అంటారు. నేను ఇక్కడ పెరిగాను, ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే పెళ్లి చేసుకున్నా. నా గతం ఇక్కడే, నా భవిష్యత్తు ఇక్కడే. కేసీఆర్ భార్య ఏపీకి చెందినవారు కాదా? ఆమెను గౌరవించడం లేదా? విడాకులు తీసుకోవాలని అడుగుతున్నామా? నాకు, నా కార్యకర్తలకు ఏం జరిగినా పూర్తి బాధ్యత కేసీఆర్ దే' అని అన్నారు.
Latest News