byసూర్య | Sat, Nov 26, 2022, 02:06 PM
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం ఎబ్బనూర్ గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు గ్రామంలో 18 ఏళ్ల నిండిన యువత కొత్తగా ఓటు నమోదు కోసం శనివారం, ఆదివారం దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్ లలో బిఎల్ఓ లను సంప్రదించాలని సూచించారు. లేదా ఆన్లైన్లో నమోదు చేసుకునే వారు www.nvsp.in వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ అరుణ గోపాల్, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు గోపాల్, బైండ్ల రామచంద్రయ్య శ్రీనివాస్ గౌడ్, మల్లయ్య, రాజు, సాంబ, పురుస్తోతం, వంశీ, కృష్ణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.