byసూర్య | Thu, Nov 24, 2022, 12:59 PM
మైనింగ్ జోన్ ఏర్పాటుకు నేను ముందునుంచీ పూర్తి వ్యతిరేకం. కొంతమంది డబ్బులకు ఆశపడి పైరవీలు చేస్తూ స్టోన్ క్రషర్లు, క్వారీలు పెట్టించడానికి చూస్తున్నారు. యాచారం, మొండిగౌరెల్లి తదితర గ్రామాల్లో స్టోన్ క్రషర్లు, క్వారీల ఏర్పాటుకు సంచాయతీల్లో అనుమతులు ఇస్తే.స్థానిక ప్రజా ప్రతినిధులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. యాచారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో 51 మంది లబ్ధి దారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కు లు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. కొంతమంది చోటా మోటా నాయకులు వ్యాపారులతో క్వారీలు పెట్టించేందుకు చూస్తున్నారన్నారు.