byసూర్య | Thu, Nov 24, 2022, 09:57 AM
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం కేటీదొడ్డి మండలం కేంద్రంలో గురువారం ఉదయం 10. 00 గంటలకు మాజీమంత్రి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రజా ఘోష బిజెపి భరోసా యాత్ర ప్రారంభం చేస్తున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షులు తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవానికి కేంద్ర, రాష్ట్ర స్థాయి బిజెపి నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని ప్రధాన మోర్చా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు, బిజెపి శ్రేణులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు.