byసూర్య | Wed, Nov 23, 2022, 01:49 PM
ఎవరికి నోటీసులు ఇచ్చినా గుండెనొప్పి అంటూ ప్రతి ఒక్కరూ ఆస్పత్రికి వెళ్తున్నారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ విమర్శించారు. మంత్రి మల్లారెడ్డి కుమారుడు నిన్న ఉదయం కూడా వాకింగ్ చేశారు. ఆరోగ్యంగా ఉన్నారు. గుండె నొప్పి ఎలా వస్తుంది? మల్లారెడ్డి తన ఫోన్ ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారు? ఆయన సంస్థల్లో పని చేసేవారే ఐటీకి సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. చట్టం ముందు అందరూ సమానమే. తన కుమారుడిని సి ఆర్పిఎఫ్ దళాలతో కొట్టించారన్న మల్లారెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయి అని రఘునందన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.