అప్పుడు నేను గాంధీనే గుర్తు చేసుకునేవాడిని... సీఎం కేసీఆర్

byసూర్య | Sun, Oct 02, 2022, 06:19 PM

తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బక్కపల్చని వాడు ఏం చేస్తారని తనను చాలా మంది అవహేళన చేశారని.. అప్పుడు తాను గాంధీజీని గుర్తు చేసుకునేవాడినని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో గాంధీజీనే అవమానించే పరిస్థితులను చూస్తున్నామని, దుర్మార్గమైన పరిస్థితులు నెలకొన్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వెకిలి వ్యక్తులు చేసే హేళనల వల్ల మహాత్మా గాంధీ గొప్పతనం తగ్గబోదని వ్యాఖ్యానించారు. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి ఆవరణలో 16 అడుగుల గాంధీ విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించి మాట్లాడారు. గాంధీ పుట్టిన దేశంలో మనందరం జన్మించడం గొప్ప విషయమన్నారు. దేశం బాగుంటే అందరం బాగుంటామని.. శాంతి లేకపోతే జీవితం చాలా బాధగా ఉంటుందని పేర్కొన్నారు. గాంధీజీ చూపిన అహింసా మార్గం శాశ్వతమైనదని.. కుల, మత, వర్గ రహితంగా ప్రతి ఒక్కరినీ స్వాతంత్ర్యం వైపు నడిపారని గుర్తు చేసుకున్నారు. గాంధీ చెప్పిన ప్రతి మాటా.. వేసిన ప్రతి అడుగూ ఆచరణీయమని చెప్పారు.మార్టిన్‌ లూథర్‌కింగ్‌ వంటి గొప్పవాళ్లు కూడా మహాత్ముడి మార్గాన్ని అనుసరించారని కేసీఆర్ గుర్తు చేశారు. దలైలామా కూడా తనకు గాంధీ ఆదర్శమని చెప్పారని.. గాంధీజీ ఈ భూమిపై పుట్టకపోయి ఉంటే తాను అమెరికా అధ్యక్షుడిని అయ్యే వాడిని కాదని బరాక్‌ ఒబామా పేర్కొన్నారని వివరించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM