byసూర్య | Thu, Sep 29, 2022, 05:29 PM
తెలంగాణ ప్రభుత్వ పథకాలపై కేంద్ర మంత్రులు ఢిల్లీలో ప్రశంసలు గుప్పించి.. గల్లీల్లో మాత్రం విమర్శలు చేయడం సరికాదని మంత్రి హరీష్ రావు అన్నారు. పార్లమెంట్ సాక్షిగా అవార్డులు ఇస్తూ.. గల్లీలో రాజకీయ విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. కేంద్రానికి దమ్ముంటే పథకాలకు నిధులు ఇచ్చి వాటి గురించి మాట్లాడాలన్నారు. 15వ ఆర్థిక కమిషన్ నివేదికలను కేంద్రం తుంగలో తొక్కిందని మండిపడ్డారు.