దుర్గం చెరువులో దూకి మహిళా ఆత్మహత్య

byసూర్య | Wed, Sep 28, 2022, 08:43 PM

మానసిక సమస్యతో బాధపడుతున్న ఓ యువతి ఆత్మహత్యయత్నం చేసింది. హైదరాబాద్ శివార్లలోని తీగల వంతెన పైనుంచి ఓ యువతి దుర్గం చెరువులోకి దూకింది. అక్కడే ఉన్న సందర్శకులు యువతి చెరువులోకి దూకడాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. లేక్ పోలీసులు యువతి కోసం స్పీడ్ బోట్ల సాయంతో గాలిస్తున్నారు. సదరు యువతి నలుపు రంగు డ్రెస్ ధరించి ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆమె వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు. దుర్గం చెరువు వద్ద తన హ్యాండ్ బ్యాగ్, చెప్పులు, చున్నీ వదిలేసి ఒక్కసారిగా చెరువులోకి దూకేసింది.


హ్యాండ్ బ్యాగ్‌ను పరిశీలించిన పోలీసులు.. ఆత్మహత్యాయత్నం చేసిన యువతిని స్వప్నగా గుర్తించారు. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రిస్క్రిప్షన్‌ను బ్యాగ్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె కుటుంబసభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. స్వప్న వయసు 23 ఏళ్లని.. ఆమెకు కొంత కాలం కిందట వివాహం జరుగగా.. ప్రస్తుతం భర్తతో విడిపోయారని కుటుంబసభ్యుల ద్వారా తెలిసింది. మానసిక ఒత్తిడికి తోడు అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఆమె ఆత్మహత్యాయత్నం చేసి ఉంటుందని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM