byసూర్య | Wed, Sep 28, 2022, 08:44 PM
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితాకు చెదు అనుభవం ఎదురైంది. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలోకి వెళ్లిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నిరసన సెగ తగలింది. పలువురు న్యాయవాదులు ఆమెను అడ్డుకున్నారు. తమ సమస్యలు ఎప్పుడూ పట్టించుకోని మీరు.. ఇప్పుడెలా వస్తారంటూ న్యాయవాదులు నిలదీశారు. గో బ్యాక్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కోర్టు ఆవరణలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. న్యాయవాదులు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. కోర్టు ప్రాంగణంలో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు న్యాయవాదులకు నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే.. అరెస్టు చేస్తామని హెచ్చరించారు. అయినా న్యాయవాదులు వెనక్కి తగ్గకపోవటంతో వారిని అదుపులోకి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.