ఈత సరదా...ఆ ముగ్గిరి ప్రాణాలను హరించింది

byసూర్య | Wed, Sep 28, 2022, 08:42 PM

ఈత సరదా ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను హరించేసింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చిర్యాల్ గ్రామంలో తీవ్ర విషాదం జరిగింది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు.. చిర్యాల్ నాట్కం చెరువులో మునిగి చనిపోయారు. బుధవారం రోజు హరహరన్, ఉబేద్ అనే ఇద్దరు విద్యార్థుల పుట్టినరోజు. ఈ సందర్భంగా తొమ్మిది మంది విద్యార్థులు చిర్యాల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లారు. తిరిగి వెళ్లే సమయంలో సరదాగా ఈత కొట్టేందుకు చిర్యాల నాట్కం చెరువులోకి దిగారు. ఈత కొడుతుండగానే ముగ్గురు విద్యార్థులు చెరువులో గల్లంతయ్యారు. మిగతా విద్యార్థులు చూస్తుండగానే ముగ్గురూ నీటిలో మునిగిపోయారు.


తొమ్మిది మంది విద్యార్థులు తీగల కృష్ణారెడ్డి కళాశాలకు చెందిన వారు. వీరంతా డిప్లోమా థర్డ్ ఇయర్ చదువుతున్నారు. చెరువులో గల్లంతు అయిన విషయం తెలియగానే.. కీసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలాజీ అనే విద్యార్థి మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీశారు. మిగతా ఇద్దరు విద్యార్థుల మృతదేహాల కోసం.. స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చనిపోయిన వారిలో హరిహరన్, ఉబేద్, బాలాజీ ఉన్నారు. మిగతా ఆరుగురు విద్యార్థులు కీసర పోలీసుల అదుపులో ఉన్నారు. కుమారుల మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM