byసూర్య | Fri, Sep 23, 2022, 04:59 PM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ టికెట్ల విక్రయాల వివాదంపై స్పందించారు. ఈ నెల 25న భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ కు సంబంధించిన టికెట్లన్నీ అజారుద్దీన్ అమ్మేసుకున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అజారుద్దీన్ మాట్లాడుతూ మ్యాచ్ టికెట్ల విక్రయాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. టికెట్ల విక్రయాలను పేటీఎంకు అప్పగించాక హెచ్సీఏతో సంబంధం లేదని అన్నారు.