అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష

byసూర్య | Wed, Aug 17, 2022, 12:51 PM

అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులకు యావజ్జీవ కారాగారా శిక్షతో పాటు, ఏడు సంవత్సరాలు, మూడు వేల రూపాయల జరిమానా విధిస్తూ మంగళవారం వరంగల్ న్యాయ స్థానం తీర్పూ నిచ్చింది, వివరాల్లోకి వెళితే పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామానికి చెందిన పొడిశెట్టి కృష్ణ, హనుమకొండ జిల్లా అయినవోలు మండలం పంతిని గ్రామానికి చెందిన మేకల రాజు ఆలియాస్ రజాక్ అనే ఇద్దరి నిందితులకు ఏడు సంవత్సరాల తో పాటు జీవిత ఖైదీలుగా శిక్షతోపాటు రూ. 3 వేల జరిమానాలను విధిస్తూ ఎస్సీ ఎస్టీ కోర్టు, సెకండ్ అడిషనల్ డిస్ర్తీక్ జడ్జీ రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి పావని తీర్పునిచ్చినట్లు పర్వతగిరి సీఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. వీరిద్దరూ అన్నారం షరీఫ్ గ్రామానికి చెందిన ఓగ్గు కొమురమ్మ పై 2021లో అత్యాచారం చేసి హత్య చేయడంతో మామునూర్ ఏసీపీ నరేష్ కుమార్, అప్పటి పర్వతగిరి సీఐ కిషన్ ల ఆధ్వర్యంలో ఇన్విస్టిగేషన్ చేశారు. హెడ్ కానిస్టేబుల్ వెంకట్రాం మృతురాలి భర్త ఒగ్గు కొమురయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ చేయగా సంఘటనకు సంబంధించిన సాక్షాలను కానిస్టేబుల్ మోహన్, సదయ్యలు కోర్టులో హాజరు పరచడంతో పిపీ సత్య నారాయణ వాదన మేరకు నిందితులిద్దరికీ శిక్ష పడినట్లు సిఐ పేర్కొన్నారు. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడిన ప్రతి ఒక్కరికి కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM