byసూర్య | Wed, Aug 17, 2022, 12:52 PM
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని చిల్లంచర్ల గ్రామాన్ని నూతన మండలంగా ప్రకటించాలని చిల్లం చెర్ల గ్రామస్థులు ఎంపి కవితకు వినతి పత్రం ను అందజేశారు. ఈ సందర్బంగా ఎంపీ కవిత మాట్లాడుతూ మండల ఏర్పాటు చేయడానికి నా వంతు సహకారం ఆందిస్తానని తెలిపారు. గతంలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్న గ్రామాన్ని చుట్టు పక్కన ఉన్న గ్రామాలను కలిపి నూతన మండలంగా ప్రకటించేవరకు ఉద్యమం కొనసాగిస్తామని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. దీనికి ప్రజాప్రతినిధులు అందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వి ఏఓల సంఘం అధ్యక్షురాలు, చిల్లంచర్ల గ్రామ వాసి మారిపెళ్లి మాధవి, సామాజిక కార్యకర్త మేకల కృష్ణయ్య, గ్రామస్థులు మేకల ప్రభు, మేకల సతీష్, పగిండ్ల శేఖర్, మహేష్ గాదె ప్రవీణ్ లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.