byసూర్య | Wed, Aug 17, 2022, 12:50 PM
స్వతంత్ర భారత 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని రఘునాథపల్లి మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. బుధవారం ఉదయం రఘునాథపల్లి బస్టాండ్ చౌరస్తా నుండి ఖిలాషాపూర్ క్రాస్ రోడ్ వరకు 2కె రన్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ జడ్పిటిసి సభ్యులు, జనగాం జిల్లా రైతుబంధు సభ్యుడు మారుజోడు రాంబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు మేకల వరలక్ష్మి, మండల సర్పంచ్ ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోకల శివకుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోళ్ల రవి గౌడ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆకుల మహేష్, కార్యదర్శి రాసమల్ల రాజు, కోశాధికారి కొన్నే సతీష్, సీనియర్ పాత్రికేయులు మేకల రవి, ఎండి. దస్తగిరి, పుల్ల రవి, చింతకింది కృష్ణమూర్తి, కొలుపుల రవి, నాసగొని శ్రీనివాస్, ఇమ్మడిశెట్టి శివరాం, సుంకరి శ్రీనివాస్, రాసమల్లయాకస్వామి, చిట్యాల స్వామి, బొల్లం రంజిత్, దుబ్బాక అజిత్, మాటూరి శివ. రాసమల్ల మల్లేష్, చెరుకు జగన్ తదితరులు పాల్గొన్నారు.