byసూర్య | Wed, Aug 17, 2022, 12:27 PM
రంగారెడ్డి జిల్లా నార్సింగీ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ భార్గవ్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందాడు. పుప్పాల్ గూడ అల్కాపూరీ కాలనీ లోని ఓ అపార్ట్మెంట్ గది లో విగత జీవిలా కనిపించిన భార్గవ్ రెడ్డిని చూసిన రూమ్ మెట్ సాయి సందీప్ వెంటనే నార్సింగీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు గత ఐదు రోజుల క్రితం భార్గవ్ రెడ్డి చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొంత కాలం నుండి సాయి సందీప్, జస్వంత్, భార్గవ్ రెడ్డి లు రూమ్ మెట్స్ ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు గా పని చేస్తున్నారు. వీకెండ్ కావడంతో భార్గవ్ రెడ్డికి చెప్పి సొంత ఊరికి వెళ్లిన జస్వంత్, సాయి సందీప్ లు 10 రోజుల అనంతరం తిరిగి హైదరాబాద్ వచ్చిన సాయి సందీప్ తన గది తలుపులు కొట్టగా ఎంతకీ తలుపులు తెరవక పోవడంతో అనుమానం వచ్చి వాచ్ మెన్ సహాయం తో కిచెన్ కిటికీ పగలగొట్టి లోపలికి వెళ్లిన సందీప్ కు బెడ్ రూమ్ లో ఉలుకు పలుకు లేకుండా భార్గవ్ రెడ్డి కనిపించాడు. 100 ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన సందీప్ ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ కు చెందిన వ్యక్తి గా గుర్తించారు.