byసూర్య | Wed, Aug 17, 2022, 12:26 PM
స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా "కవి సమ్మేళనం" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి తెలిపారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐ. డి. ఓ. సి. కార్యాలయంలో " కవి సమ్మేళనం" కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలలో సామూహిక "జాతీయ గీతాలాపన", "కవి సమ్మేళనం" కార్యక్రమాలను నిర్వహించటం జరిగిందని, కవులు తమ కవితా గానంతో అలరించారని ఆయన అన్నారు. (55) మంది కవులు కవి సమ్మేళనంలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కవులకు ప్రశంస పత్రాలను అందజేసి వారిని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, డిఈఓ రవీందర్, డి డబ్ల్యూఓ పుష్పలత, డిపిఆర్ఓ ఎంఎ రషీద్, ఎఓ రాజేందర్ గౌడ్, కవులు, జిల్లా అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.