byసూర్య | Wed, Aug 17, 2022, 11:52 AM
స్వాతంత్ర భారత్ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణం మధ్యలో గల 65వ నంబరు జాతీయ రహదారి పక్కనున్న రోడ్లు భవనాలు అతిథిగృహం ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై పలువురు పోలీసు అధికారులు జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వి. రఘు. సీఐ తోట భూపతి , పట్టణ ఎస్ఐ కే. శ్రీకాంత్, రూరల్ ఎస్ఐ పరమేశ్వర్, ఏ ఎస్ ఐ రెహమాన్, పలువురు పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.