సూసైడ్ నోట్ రాసి యువకుడు ఆత్మహత్య
byసూర్య |
Wed, Aug 17, 2022, 11:33 AM
మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధి లోని మీర్ పేట్ ఎన్. బి. ఆర్ కాలనీలో నాగార్జున (26) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మ నాన్న నన్ను క్షమించండి అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగార్జున చంపాపేట్ డీమార్ట్ లో పనిచేస్తునాడు. గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉండడంతో మనస్థాపంకి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలానికి చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Latest News