కర్ణాటక రోడ్డు ప్రమాదంలో...హైదరాబాదీల మరణం

byసూర్య | Mon, Aug 15, 2022, 11:12 PM

ఓ ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్తుండగా కర్నాటక రాష్ట్రంలో జరిగిన ప్రమాదంలో హైదరాబాదీలు దుర్మారణం చెందారు.  కర్ణాటకలోని బీదర్ జిల్లా బంగూర్ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మృతులు హైదరాబాదు బేగంపేటకు చెందినవారిగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. గిరిధర్ (45), అనిత (30), ప్రియ (15), మహేశ్ (2), జగదీశ్ (35) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరంతా కలబురిగి జిల్లా గంగాపూర్ దత్తాత్రేయ ఆలయ సందర్శనకు కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  వీరు ప్రయాణిస్తున్న కారు ఓ కంటైనర్ ను వెనుకనుంచి ఢీకొన్నది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM