కర్ణాటక రోడ్డు ప్రమాదంలో...హైదరాబాదీల మరణం

byసూర్య | Mon, Aug 15, 2022, 11:12 PM

ఓ ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్తుండగా కర్నాటక రాష్ట్రంలో జరిగిన ప్రమాదంలో హైదరాబాదీలు దుర్మారణం చెందారు.  కర్ణాటకలోని బీదర్ జిల్లా బంగూర్ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మృతులు హైదరాబాదు బేగంపేటకు చెందినవారిగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. గిరిధర్ (45), అనిత (30), ప్రియ (15), మహేశ్ (2), జగదీశ్ (35) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరంతా కలబురిగి జిల్లా గంగాపూర్ దత్తాత్రేయ ఆలయ సందర్శనకు కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  వీరు ప్రయాణిస్తున్న కారు ఓ కంటైనర్ ను వెనుకనుంచి ఢీకొన్నది.


Latest News
 

ఈ నెల 28న ఓయూలో జాబ్ మేళా Sat, Sep 23, 2023, 10:46 AM
ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ Sat, Sep 23, 2023, 10:44 AM
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్.... పోచారం శ్రీనివాస్ రెడ్డి Fri, Sep 22, 2023, 09:35 PM
త్వరలో పేదల కోసం మరిన్ని పథకాలు...కేటీఆర్ Fri, Sep 22, 2023, 09:34 PM
'ఓట్‌ ఫ్రం హోం'.. వాళ్లకు మాత్రమే ఈ ఆప్షన్ Fri, Sep 22, 2023, 08:09 PM