పట్టుకొనేందుకు వెళ్లిన తెలంగాణ పోలీసులపై బీహార్ లో నింధితుల కాల్పులు

byసూర్య | Mon, Aug 15, 2022, 10:02 PM

బీహార్ నేరస్థులు  మన తెలంగాణ రాష్ట్ర పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. సైబర్ నేరాలకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న నేరస్థులను పట్టుకునేందుకు బీహార్ వెళ్లిన తెలంగాణ పోలీసులపై నిందితులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. వాహన కంపెనీల ఫ్రాంచైజీల పేరిట సైబర్ నేరాలకు పాల్పడిన కొందరు నేరగాళ్లు బీహార్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు నవడా జిల్లా వెళ్లారు.


భవానిబిగా గ్రామంలో నిందితులు ఉన్నట్టు తెలుసుకుని స్థానిక పోలీసుల సాయంతో పట్టుకునేందుకు ప్రయత్నించారు. గమనించిన ప్రధాన నిందితుడు మితిలేష్ ప్రసాద్‌ పోలీసులపై కాల్పులు జరిపి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. మిగిలిన నలుగురు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ. 1.22 కోట్ల నగదు, 3 కార్లు, 5 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచిన పోలీసులు పీటీ వారెంట్‌తో హైదరాబాద్ తీసుకురానున్నారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM