రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
byసూర్య |
Sat, Aug 13, 2022, 04:55 PM
ఉత్తర కర్ణాటకలోని బీదర్ జిల్లా హొన్నికేరి క్రాస్ వద్ద శుక్రవారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాల్కి నుంచి బీదర్కు వెళుతున్న కేఎస్ఆర్టీసీ బస్సు- తెలంగాణ నుంచి మహారాష్ట్రలోని ఉదగీరకు వెళుతున్న కారును ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. మృతులు హైదరాబాద్కు చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిని బీదర్లోని బ్రిమ్స్ వైద్యశాలలో చేర్పించారు. జనవాడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Latest News