byసూర్య | Sat, Aug 13, 2022, 04:53 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ ప్రాథమిక అరోగ్య కేంద్రంలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 17వ తేదీన ఏర్పాటు చేస్తున్న రక్తదాన శిభిరం అవగాహన బ్యానర్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు చింతల్ లోని తన కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రక్తదాతలు తమ పేర్లను నమోదు చేసుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఆనంద్, డాక్టర్ నవనీత తదితరులు పాల్గొన్నారు.