byసూర్య | Mon, Aug 08, 2022, 05:30 PM
హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గంలోని లంగర్ హౌస్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా లంగర్ హౌస్ బీజేపీ నేతలు సుమారు 200 మంది స్కూల్ విద్యార్థులతో జాతీయ పతాకాలతో పాదయాత్ర చేశారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ఈ యాత్ర కొనసాగింది. బాపునగర్ బస్ స్టాప్ వద్ద మొదలైన ఈ యాత్ర లంగర్ హౌస్ బస్ స్టాప్ వరకు వెళ్లి తిరిగి బాపునగర్ వరకు వచ్చారు. ఈ కార్యక్రమంలో లంగర్ హౌస్ బిజెపి అధ్యక్షుడు నాగేందర్ ప్రకాష్ తో పాటు బిజెపి నేతలు పాల్గొన్నారు.