byసూర్య | Mon, Aug 08, 2022, 05:26 PM
తెలంగాణలో 2 రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలెర్ట్ ను జారీ చేసింది. నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, సిద్ధిపేట జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.