byసూర్య | Sat, Aug 06, 2022, 12:33 PM
తల్లిదండ్రులు మందలించారని మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఉరేసుకుని మృతి చెందాడు. ఈ ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ మధుసూదన్ వివరాల ప్రకారం మైలార్ దేవ్ పల్లి , హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముంటున్న పవన్ (25) అనే వ్యక్తి ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటూ ఇంట్లోనే ఉంటాడు.
గత నెల 30న ఏదైనా పని చూసుకొని ఉద్యోగం చేయాలని గట్టిగా మందలించడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన పవన్ శ్రీరామ కాలనీ స్నేహితుల గదిలో ఉంటున్నాడు. 5న మధ్యాహ్నం ఒంటి గంటకు దుప్పటితో ఫ్యాన్ కు ఉరివేసుకొని మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.