byసూర్య | Fri, Aug 05, 2022, 01:55 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో పంట పొలాల్లో నాటు వేసేందుకు వచ్చిన ప్రమాదవశాస్తూ కాలుజారి కింద పడిపోగా అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర రాష్ట్రం చంద్రపూర్ జిల్లా కు చెందిన అమూల్ చౌదరి అనే వలస కార్మికుడు రాజన్న సిరిసిల్ల జిల్లా మండలం చుట్టుపక్క గ్రామాలలో వరి పంట పొలాలలో నాట్లు వేసేందుకు వచ్చారు.
మృతుడు యధావిధిగా శుక్రవారం ఉదయం సుమారు 6: 30 గంటల ప్రాంతంలో నాటు వేసేందుకు పొలం గట్టుపై నుంచి నడుచుకుంటూ వెళుతుండగా ప్రమాదవశాస్సు కాలు జారీ పొలంలో పడిపోయాడు. అక్కడే ఉన్న తోటి కార్మికులువెళ్లి చూసేసరికి విగత జీవిగా పడి ఉన్నాడు. స్థానిక సర్పంచి రవీందర్ గుప్తాకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. మృతుని వివరాలు సేకరించి మృతదేహాన్నివారి స్వగ్రామానికి తరలించారు.