byసూర్య | Fri, Aug 05, 2022, 01:56 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కోరుతూ శుక్రవారం వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి ఆధ్వర్యంలో తిప్పపూర్ బస్టాండ్ సమీపంలోని రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.