byసూర్య | Fri, Aug 05, 2022, 01:52 PM
జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లె వెంకటాద్రినగర్ వంతెన శుక్రవారం మరోసారి నీట మునిగింది. ఈ కారణంగా కాలనీకి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వర్షాకాలం సీజన్లో పలుమార్లు వెంకటాద్రి నగర్ వంతెన వరదనీటిలో మునిగి కాలనీకి – జగిత్యాలకు అనేక సార్లు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన పై వరద నీరు ప్రవహిస్తున్న కారణం చేత స్థానికులు కొట్టుకుపోయే ప్రమాదం ఉన్న దృష్ట్యా జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో టౌన్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపేశారు. ఈ క్రమంలోనే ఈ వంతెన మరోసారి వరద నీటిలో మునిగిపోవడంతో ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది.