మరోసారి వరద నీటిలో మునిగిన వంతెన

byసూర్య | Fri, Aug 05, 2022, 01:52 PM

జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లె వెంకటాద్రినగర్ వంతెన శుక్రవారం మరోసారి నీట మునిగింది. ఈ కారణంగా కాలనీకి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వర్షాకాలం సీజన్లో పలుమార్లు వెంకటాద్రి నగర్ వంతెన వరదనీటిలో మునిగి కాలనీకి – జగిత్యాలకు అనేక సార్లు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన పై వరద నీరు ప్రవహిస్తున్న కారణం చేత స్థానికులు కొట్టుకుపోయే ప్రమాదం ఉన్న దృష్ట్యా జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో టౌన్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపేశారు. ఈ క్రమంలోనే ఈ వంతెన మరోసారి వరద నీటిలో మునిగిపోవడంతో ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM