byసూర్య | Fri, Jul 01, 2022, 10:53 AM
కల్వకుర్తి పట్టణం లోని ప్రభుత్వ అతిథి గృహంలో శుక్రవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చందర్ రెడ్డి ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు గా ఇంజమూరి కిరణ్ ని నియమించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు పనిచేయాలని పిలుపునిచ్చారు. రోబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మల్లెపల్లి జగన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి అనిల్ గౌడ్ జంగయ్య దామోదర్ రెడ్డి గోపాల్ శంకర్ నాయక్ హరికృష్ణ రమేష్ రవి శివప్రసాద్ షాకీర్ శ్యాంసుందర్ రెడ్డి దాస్య తదితరులు పాల్గొన్నారు.