byసూర్య | Tue, Jun 21, 2022, 09:49 PM
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం చేసిన కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆవుల సుబ్బారావును తెలంగాణ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వహిస్తున్న సుబ్బారావు తైనాల వద్ద శిక్షణ పొందిన ట్రైనీలను అల్లర్లకు ప్రేరేపించినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.