byసూర్య | Tue, Jun 21, 2022, 09:18 PM
రెండు కీలక పోస్టులను భర్తీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వై.సతీష్ రెడ్డి నియమితులయ్యారు. టీఆర్ ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ గా కొనసాగుతున్న సతీష్ రెడ్డికి తాజాగా రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవి లభించింది.తెలంగాణ స్టేట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అనిల్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.