byసూర్య | Tue, Jun 21, 2022, 09:15 PM
తెలంగాణలో వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర మంగళవారం నాటికి 100 రోజులకు చేరుకుంది. వైఎస్ షర్మిల పాదయాత్ర మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడకు చేరుకుంది. షర్మిల పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కోదాడలో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. షర్మిలను చూసేందుకు జనం కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.