అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపండి: ఎమ్మెల్సీ కవిత
byసూర్య |
Tue, Jun 21, 2022, 11:21 AM
నిజామాబాద్ జిల్లాలో అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆక్రమ మైనింగ్ పై వస్తున్న ఫిర్యాదులు, కథనాలపై మంగళవారం ఉదయం ఆమె జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు మైనింగ్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతామని కలెక్టర్ తెలిపారు.
Latest News