byసూర్య | Wed, May 25, 2022, 09:23 PM
ప్రభుత్వ నిర్వాకంతో తెలంగాణలో వడ్ల కుప్పలపై రైతులు ఆత్మహత్య చేసుకున్నా, 25 మంది ఇంటర్ విద్యార్థులు ఉసురు తీసుకున్నా.. ఒక్క కుటుంబాన్నీ కేసీఆర్ పరామర్శించలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ బండి సంజయ విమర్శించారు. రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉన్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
ఇక్కడ కష్టాలు పడుతున్న రైతుల్ని పట్టించుకోకుండా పంజాబ్ వెళ్లి రైతులను పరామర్శించడానికి సీఎం కేసీఆర్కు సిగ్గుండాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలే లేనట్లుగా, రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉన్నట్లుగా కేసీఆర్ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర చేస్తున్నారన్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్వాకంతో తెలంగాణలో వడ్ల కుప్పలపై రైతులు ఆత్మహత్య చేసుకున్నా, 25 మంది ఇంటర్ విద్యార్థులు ఉసురు తీసుకున్నా.. ఒక్క కుటుంబాన్నీ కేసీఆర్ పరామర్శించలేదన్నారు.
తెలంగాణ రాకముందు విద్యార్థులు, ఆర్టీసీ కార్మికుల బలవన్మరణాలు జరగలేదని సంజయ్ అన్నారు. రాష్ట్రాన్ని ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు.