అలా చేస్తే జైలుకే.. అధికారుల హెచ్చరిక
byసూర్య |
Sun, May 22, 2022, 09:38 AM
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినా, టెక్నాలజీ ఉపయోగించి పేపర్ లీక్ చేసినా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సెస్సీ బోర్డు అధికారులు హెచ్చరించారు. ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసినా, వీడియోలు తీసినా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ మాల్ప్రాక్టీస్ అండ్ అన్ ఫెయిర్ మీన్స్) యాక్ట్ 25, 1997 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేస్తామని తెలిపారు. నేరం రుజువైతే 6 నెలలకు తగ్గకుండా జైలు శిక్ష పడుతుంది. గరిష్ఠంగా మూడేళ్లు శిక్ష, రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు.
Latest News