byసూర్య | Sat, May 21, 2022, 02:11 PM
నారాయణఖేడ్ లోని దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి గృహం ఆవరణలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిపిసిసి సభ్యులు డాక్టర్ పి. సంజీవ్ రెడ్డి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకె దక్కిందన్నారు. భారతదేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసిన ఘనత రాజీవ్ ది అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోజిరెడ్డి, నారాయణఖేడ్ మున్సిపల్ కౌన్సిలర్లు దారం శంకర్, వివేకానంద, రాజేష్ చౌహన్, నాయకులు వినోద్ పటేల్, పండరిరెడ్డి, ఈశ్వరప్ప, శంకర్ ముదిరాజ్, నారాయణ, నర్సింలు, అర్జున్, సుభాష్ రెడ్డి, సద్దాం, హనుమoడ్లు, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.