byసూర్య | Tue, May 17, 2022, 08:41 AM
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట డివిజన్ సమతాపురి కాలనీ, లో బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్లో పడి మనోజ్ అనే బాలుడు మృతి చెందిన సంఘటనపై అధికారులు స్పందించ పోవడంతో మనోజ్ కుటుంబ సభ్యులు, కొత్తపేట కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ స్విమ్మిం గ్ పూల్ ఎదుట ధర్నా చేపట్టారు. దీంతో స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు బ్లూ ఫ్యాట్ స్విమ్మింగ్ పూల్ సీజ్ చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ మనోజ్ కుటుంబ సభ్యులు బ్లూ ఫ్యాబ్ స్విమింగ్ పూల్ వద్ద ఆందోళన చేపట్టారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా స్విమింగ్ పూల్ నిర్వహిస్తున్న అశోక్ గౌడ్ తదితరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్తపేట కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ సంఘటన స్థలానికి వచ్చి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబాని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చైతస్యపురి పోలీసులు స్విమ్మింగ్ పూల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.