byసూర్య | Tue, May 17, 2022, 08:39 AM
నకిలీ విత్తనాల వ్యాపారాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లుగా శంకర్ పల్లి సిఐ మహేష్ గౌడ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమాత్రం నిబంధనలను ఉల్లంఘించినా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. వివిధ దుకాణాలలో స్థానిక రైతులు విత్తనాలను కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు పరిశీలించి తీసుకోవాలని సీఐ సూచించారు.