ట్రావెల్స్ వ్యాపారి అదృశ్యం

byసూర్య | Tue, May 17, 2022, 08:41 AM

ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృ శ్యమైన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కొత్తపేట హుడా కాంప్లెక్స్ లో నివసించే వంగరి రాము ట్రావెల్స్ వ్యాపారి. గత గురువారం సాయంత్రం వ్యాపారం నిమిత్తం బైక్ పై (టీఎస్ 07 ఎస్ఆర్ 9140) పై బయటకు వెళ్లాడు. రాము ఎంతకూ తిరిగి రాకపోవటంతో కుటుంబ సభ్యులు అతడి వ్యాపార భాగస్వామి రాహులు అడిగారు. ఇద్దరం కలిసి చంపాపేట వెళ్లామని. అక్కడ పని పూర్తి అయ్యాక తాను ఇంటికి వెళ్లానని చెప్పాడు. తెలిసిన వారిని వాకబు చేయగా సుమన్ కుమార్ అనే స్నేహితుడితో కలిసి కొత్తపేట నక్షత్ర హోటల్ గదిలో ఉన్నాడని, శుక్రవారం ఉదయం ఇంటికి వెళ్లానని చెప్పాడని తెలిసింది. బంధువులు, స్నేహితులను వాకబు చేసినా రాము ఆచూకీ తెలియరాలేదు. దీంతో తల్లి వరలక్ష్మి చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

ముఖ్యమంత్రిని కలిసిన నిర్మల రెడ్డి Fri, Mar 29, 2024, 01:41 PM
దొంగతనం కేసు చేదించిన పోలీసులు Fri, Mar 29, 2024, 01:41 PM
బార్ అసోసియేషన్ కార్యదర్శిగా సురేష్ గౌడ్ Fri, Mar 29, 2024, 01:38 PM
టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలి Fri, Mar 29, 2024, 01:37 PM
ఎన్నికల్లో పోటీపై తమిళిసై కీలక వ్యాఖ్యలు Fri, Mar 29, 2024, 01:37 PM