ఇన్ టెక్ వెల్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన...
byసూర్య |
Sat, May 14, 2022, 01:39 PM
తాగునీటి సరఫరా వ్యవస్థను సమూలంగా ఆధునీకరించి హైదరాబాద్ నగరానికి తాగునీటి కొరత రానీయకుండా నీటి సరఫరా చేసేందుకు నాగార్జునసాగర్ సమీపంలో శనివారం సుంకిశాల వద్ద హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో రూ. 1453 కోట్లతో చేపట్టే ఇన్టెక్ వెల్ పనులకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, సీహెచ్ మల్లా రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, జలమండలి అధికారులు పాల్గొన్నారు.
Latest News