byసూర్య | Sat, May 14, 2022, 12:49 PM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న వివక్షపై సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి అమిత్ షా ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణలో పర్యటించనున్న అమిత్ షాను వివిధ అంశాలపై ట్విట్టర్ వేదికగా కవిత ప్రశ్నించారు.
తెలంగాణకు కేంద్రం నుండి రావాల్సిన రూ. 3000 కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని, బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్: రూ. 1350 కోట్లు, జిఎస్టీ పరిహారం: రూ. 2247 కోట్ల సంగతేమిటి అని ప్రశ్నించారు. గత 8 సంవత్సరాలలో తెలంగాణకు ఒక్క ఐఐటీ, ఐఐఎం, ఐఐ ఎస్ ఈ ఆర్, ఐఐటి, ఎన్ ఐ డి మెడికల్ కాలేజీ లేదా నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో తెలంగాణ బిడ్డలకు వివరించాలని అమిత్ షాను డిమాండ్ చేశారు.