తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు: బండి
byసూర్య |
Sat, May 14, 2022, 01:08 PM
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 30వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ శుక్రవారం రాత్రి ఆలస్యంగా మహేశ్వరం నియోజకవర్గంలోని సిరిగిరిపురం సమీపంలోని హెచ్ఎండీ పార్క్ వద్దకు చేరకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ పంపిన లీగల్ నోటీస్ పై ఘాటు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసారు. కేటీఆర్ నిర్వాకం వల్ల ఇంటర్మీడియట్ కు చెందిన 27 మంది విద్యార్థులు చనిపోయారని, ఆ పాపం ఒట్టిగ పోతదా? పేద విద్యార్థులు చనిపోతే మీ ముఖ్యమంత్రి కనీసం స్పందించకపోవడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రులు బాధ చెప్పుకోవడానికి పోతే లాఠీఛార్జ్ చేయించడం హేయమైన చర్యలు మీవని కేటీఆర్ పైన ధ్వజమెత్తారు.
Latest News