చెట్టుకూలి ఇద్దరు మరణం...మరో ముగ్గురు చిన్నారులకు గాయాలు

byసూర్య | Tue, Jan 18, 2022, 08:18 PM

చెట్టు నీడ అందరిని కాపాడుతుంది. కానీ ఆ చెట్టే కూలితే పరిస్థితి ఏమిటీ. ఖమ్మంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భారీ రావి చెట్టు అమాంతం కూలిపోవడంతో దారుణం జరిగిపోయింది. క్రికెట్ ఆడుకుంటున్న చిన్నారులపై భారీ వృక్షం పడడంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే చనిపోగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన పట్టణంలోని బ్రాహ్మణ బజార్‌లో జరిగింది. సాయంత్రం వేళ చిన్నారులు సరదాగా క్రికెట్ ఆడుకుంటున్న సమయంలో రావిచెట్టు అమాంతం కుప్పకూలింది. పక్కనే ఉన్న శిథిలమైన ప్రహరీ గోడ మీద పడింది. చెట్టు పడడంతో గోడ కుప్పకూలి ఆడుకుంటున్న చిన్నారులపై పడినట్లు తెలుస్తోంది. రాళ్ల కింద పడి తీవ్ర గాయాలపాలై ఇద్దరు చిన్నారులు ఆయుష్(12), దిగంత్(8) ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు సాకేత్(8), అనుముల్(5), చరణ్ సాయి(5) స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కళ్లు ముందే ఆడుకుంటున్న చిన్నారులు నిమిషాల వ్యవధిలోనే విగతజీవులుగా కనిపించడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎలాంటి ఈదురు గాలులు రాకున్నా చెట్టు ప్రమాదవశాత్తూ కూలిపోవడం స్థానికులను షాక్‌కి గురిచేస్తోంది.


Latest News
 

రాజాసింగ్‌కు కాల్ చేసిన టెలీకాలర్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఎమ్మెల్యే Tue, May 07, 2024, 10:13 PM
హైదరాబాద్‌లో తరచూ పవర్ కట్స్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం Tue, May 07, 2024, 10:08 PM
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు Tue, May 07, 2024, 10:03 PM
నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి Tue, May 07, 2024, 09:58 PM
జీరో ట్రాఫిక్ కోసం అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు.. మాల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి స్పెషల్ మేనిఫెస్టో Tue, May 07, 2024, 09:55 PM