బదిలీల ప్రక్రియ పూర్తయితే ఖాళీ ఉద్యోగాల భర్తీ

byసూర్య | Tue, Jan 18, 2022, 08:19 PM

జీఓ 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ ఆ జీవో రద్దు చేయాలని కోరుతున్నారంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు వద్దన్నట్టేనని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. జిల్లాల్లో స్థానికులకు ఉద్యోగాలకు దక్కుతాయని.. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగానే జీవో 317 ఇచ్చామన్నారు. బీజేపీ నేతలు ఎవరి మీద పోరాటం చేస్తున్నారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించిన హరీశ్ బాలానగర్, కోయిలకొండలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ప్రారంభించారు. అనంతరం హరీశ్ మాట్లాడుతూ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తయితే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. సుమారు 60 వేల నుంచి 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేవలం రాజకీయాల కోసమే కొందరు మాట్లాడుతున్నారని.. వారికి నిరుద్యోగులపై ప్రేమ లేదని హరీశ్ అన్నారు. నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే కేంద్రంలో ఖాళీగా ఉన్న పది లక్షలకు పైగా ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని హరీశ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని హరీశ్ అన్నారు. వైద్య రంగంలో నీతి ఆయోగ్ ప్రకటించిన ర్యాంక్‌లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని.. బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్ చివరి స్థానంలో ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. విద్యుత్, సాగునీరు, వైద్యం, విద్యా రంగాల్లో ముందుకు సాగుతున్నామన్నారు. బీజేపీది గోబెల్స్ ప్రచారం మినహా మరో పని ఉండదని ఎద్దేవా చేశారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అనే రోజులు పోయి.. నేను సర్కారు ఆసుపత్రికే వెళ్తాననే రోజులొచ్చాయని హరీశ్ అన్నారు.


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM