byసూర్య | Tue, Jan 18, 2022, 08:17 PM
ఉద్యోగులు, ఉపాధ్యాయులు తలుచుకుంటే ఏమవుతుందో కేసీఆర్ గుర్తు చేసుకోవాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ హెచ్చరించారు. టీచర్ల సమస్యలు పరిష్కరించే వరకు వారి తరఫున పోరాడతామని స్పష్టం చేశారు. ఉత్వరలోనే బీజేపీ జాతీయ నేతలతో ఉద్యోగ, ఉపాధ్యాయుల వర్చువల్ సమావేశాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. కేసీఆర్ జాతకం బాగాలేదని సంజయ్ అన్నారు. 317 జీవోను సవరించే వరకు సీఎం కేసీఆర్ను వదిలే ప్రసక్తేలేదని వ్యాఖ్యానించారు. 2023లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేట్ పాఠశాల నుంచి డబ్బులు దండుకోవటం కోసమే ఇంగ్లిషు మీడియం అంటున్నారని విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకోవద్దని.. బీజేపీ అండగా ఉంటోందని భరోసానిచ్చారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ కొత్త డ్రామాలు మొదలుపెట్టాడని సంజయ్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఒత్తిడితోనే ఉపాధ్యాయ ఉద్యోగులు విధుల్లో చేరుతున్నారని చెప్పుకొచ్చారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి ఇస్తామని ఇతర రాష్ట్రాలు హామీ ఇవ్వలేదని టీఆర్ఎస్కు కౌంటర్ ఇచ్చారు. ప్రధాని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సమావేశానికి ఎందుకు హాజరుకాలేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.